గౌతంనగర్, మే31:ప్రభుత్వం నాలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించిందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ మిర్జాల్గూడ రాజానగర్ కాలనీలో రూ.1.70కోట్లతో నిర్మిస్తున్న బాక్స్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బాక్స్ డ్రైనేజీ ఏర్పాటుతోనే వరద ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాకాలంలోపే బాక్స్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజా నగర్ నుంచి మిర్జాల్గూడ వరకు నాలా కుంచించి పోయిందని చిన్నపాటి వర్షాలకు కాలనీలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు. ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దీపక్, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, నాయకులు,కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.