వినాయక్నగర్, జూన్ 4: బాక్స్డ్రైన్ల నిర్మాణంతో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం వినాయక్నగర్ డివిజన్ దీన్దయాళ్నగర్, చంద్రగిరి కాలనీలలో రూ.1.40కోట్లతో బాక్స్డ్రైనేజీ నిర్మాణపనులకు కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మితో కలసి శంకుస్థాపన చేశారు. దీన్దయాళ్నగర్ కమ్యూనిటీ హాల్లో అదనపు గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ అభివృద్ధిపనులను వేగవంతంగా పూర్తిచేస్తామని అన్నారు. కాలనీలో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామని అన్నారు. సోమయ్య ఎన్క్లేవ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం పరశురాంరెడ్డి, పిట్ల శ్రీనివాస్, సతీశ్కుమార్, రాముయాదవ్ గుండ నిరంజన్, ఓంప్రకాశ్, మంగేశ్, తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్, జూన్ 4 : కరోనా సంక్షోభంలోనూ ప్రభు త్వం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ భగత్సింగ్నగర్లో స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో కలిసి రూ.12లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలోని మురుగు ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, రావుల అంజయ్య, సతీశ్ కుమార్, కరంచంద్, జీవగన్, సాయికుమార్, గోకుల్ కుమార్, సతీశ్ కుమార్, ఎస్ఆర్ ప్రసాద్, శివకుమార్, చెన్నారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మహేశ్, రాజు పాల్గొన్నారు.
మల్కాజిగిరి, జూన్ 4: సాటి ప్రజలకు ఇబ్బందులు కల్పించే ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కృపా ఆనంద్ కాలనీవాసులకు సూచించారు. శుక్రవారం స్థానిక కార్పొరేటర్, ప్రజా ప్రతినిధులతో కలిసి కాలనీవాసులతో సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా కాలనీ చివర్లో ఉన్న రోడ్డును రాత్రి పూట కర్రలతో మూసివేస్తున్నారని కొందరు ఎమ్మెల్యే, కార్పొరేటర్కు ఫిర్యాదు చేయగా శుక్రవారం కాలనీవాసులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది ఏమైనా ఉంటే రాత్రి పూట పోలీసు గస్తీ పెట్టేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్ర మంలో కార్పొరేటర్ శ్రావణ్కుమార్, వినాయక్న గర్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీశ్గౌడ్, నాయకులు బద్దం పరుశరాంరెడ్డి, టీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, కార్యదర్శి జీఎన్వీ సతీశ్కుమార్, గుండా నిరంజన్, మోహన్రెడ్డి, సంతోష్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.