మల్కాజిగిరి, ఏప్రిల్ 6: సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్నివర్గాలకు, కులాలకు పక్షపాతి అని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. దోబీలకు, నాయీబ్రాహ్మణులకు ప్రతినెల 250 యూనిట్ల విద్యుత్ సరఫరాను ఉచితంగా ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం మల్కాజిగిరి చౌరస్తాలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ లాంటి మహనీయుడు మన రాష్ర్టానికి సీఎంగా ఉండటం వల్ల అన్నివర్గాలకు చెందిన వారు సంతోషంగా ఉన్నారన్నారు.