గౌతంనగర్/ కాప్రా, ఆగస్టు4: గుండెపోటుతో మరణించిన పాత్రికేయుడు శ్రీనివాస్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీతో కలిసి ఎల్లారెడ్డిగూడలో పరామర్శించారు. బాధిత కుటుంబానికి వారు తమ సానుభూతి తెలిపి ఓదార్చారు. శ్రీనివాస్ పిల్లలిద్దరికీ చెరో లక్ష రూపాయల చొప్పున మైనంపల్లి హన్మంతరావు వ్యక్తిగత ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హమీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ విజ్ఙప్తి మేరకు మంత్రి కేటీఆర్తో మాట్లా డి డబుల్ బెడ్రూం ఇల్లును మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. మృతుడి భార్యకు ఏదైనా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, టీయూడబ్ల్యూజే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు ఎన్. హరికృష్ణ, నిరంజన్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్రాజు, సహాయ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, విల్సన్, గిరి, లవకుమార్, శివకుమార్, లక్ష్మారెడ్డి, మురళీకృష్ణ, సంగమేశ్, విజయ్ తేజ, మహేశ్, మల్లేశ్గౌడ్, పవన్, మనోహర్, రాముయాదవ్, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.