మూసాపేట : మూసాపేటలో నవయువక యూత్ అసోసియోషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవయువక యువజన సంఘం అధ్యక్షుడు, డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వేడుకల్లో మాజీ కార్పొరేటర్ బాబురావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.