కేపీహెచ్బీ కాలనీ : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్లో రూ.6.22 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సహకారంతో కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కుల అభివృద్ధి లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇప్పటికే తొంభై శాతం సమస్యలను పరిష్కరించడం జరిగిందని, చేపట్టిన పనులు పూర్తైతే సమస్యలన్నీ తీరుతాయన్నారు. బాలాజీనగర్ డివిజన్లో పురాతన కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా డ్రైనేజీ పైప్లైన్లను ఆధునీకరించే పనులను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఎమ్మెల్యే మాధవరం
ఆదేశించారు.