కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 29 : మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించేందుకు అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. గురువారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆయా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నదని, ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
నియోజకవర్గంలోని కొంపల్లి, జగద్గిరిగుట్ట, ద్వారకనగర్, భగత్సింగ్నగర్, నందానగర్, సుభాష్నగర్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వృద్ధులు, కరోనా బాధితులకు ప్రత్యేకంగా అంబులెన్స్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించి, మాస్కులు ధరించాలన్నారు. కరోనా సోకినా వారు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలన్నారు. సమావేశంలో వైద్యాధికారులు డా.ఆనంద్, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ రఘు, వైస్చైర్మన్ గంగయ్యనాయక్, దుండిగల్ వైస్చైర్మన్ టి.పద్మారావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రావుల శేషగిరి, బి.విజయ్శేఖర్గౌడ్, మంత్రి సత్యనారాయణ, కౌన్సిలర్లు శంబీపూర్ కృష్ణ, భరత్, ఆయా డివిజన్ల అధ్యక్షులు ఎండీ రఫిక్, సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
జీడిమెట్ల, ఏప్రిల్ 29 : కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాశ్నగర్ డివిజన్ పరిధిలో కొవిడ్ పరీక్ష కేంద్రాలతో పాటు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీఆర్ఎస్ నేత, మాజీ కార్పొరేటర్ గుడిమెట్ల సురేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక సంక్షేమ సంఘం నాయకులు, అధికారులతో కలిసి అపురూపకాలనీ, సుభాశ్నగర్ బస్తీలలో పర్యటించి కొవిడ్ సెంటర్ల ఏర్పాటు చేసే భవనాలను పరిశీలించారు. ఇప్పటి వరకు 45 ఏండ్ల వారికే వ్యాక్సిన్ వేస్తున్న క్రమంలో మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో కొవిడ్ సెంటర్ల ఏర్పాటు స్థలాలను సురేశ్రెడ్డి పరిశీలించి వైద్యాధికారులకు నివేదికను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.