కుత్బుల్లాపూర్,ఆగస్టు4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని గణేశ్నగర్ అమ్మభవాని ఆలయం వద్ద రూ.4 లక్షల సీడీపీ నిధులతో చేపడుతున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు కాలనీల్లో సంక్షేమ సంఘాలు ప్రజలను మరింత చైతన్యవంతులను చేయడంతో పాటు కాలనీల్లో కావాల్సిన అన్ని వసతుల కల్పన కోసం తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు అభివృద్ధి నిర్మాణాలు అందుబాటులో ఉండేలా నాణ్యతతో కూడిన పనులను చేయించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీశ్, బొడ్డు వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జయరామ్, మాజీ కౌన్సిలర్ కిషన్రావు, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీనివాస్నగర్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఆయా విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు పెండింగ్లో ఉన్న సీసీరోడ్డు నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కాలనీల్లో సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, ఏఈ సురేందర్నాయక్, కాలనీ అధ్యక్షులు ప్రభాకర్, నరేందర్రెడ్డి, మల్లేశ్వర్రావు పాల్గొన్నారు.