కుత్బుల్లాపూర్,ఆగస్టు3: అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. మంగళవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో రజకులకు, నాయీబ్రహ్మణుల వృత్తికి 250 యూనిట్ల ఉచితంగా కరెంటును అందించేందుకు నియోకవర్గస్థాయి ఆయా సంఘాల ప్రతినిధులు, బీసీ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెలూన్లు, లాండ్రీల రిజిస్ట్రేషన్, 250 యూనిట్ల కంటే ఎక్కువ బిల్లు వస్తే చెల్లింపు విధానం, మోడల్ సెలూన్ల ఏర్పాటు, కమర్షియల్ మీటర్లు, కొత్త మీటర్లు వంటి అనేక సమస్యలపై వచ్చిన అనుమానాలను నాయీబ్రాహ్మణ, రజక సంఘం సభ్యులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిణి ఎంఎస్ ఝాన్సీ రాణి, ఎలక్ట్రిసిటి ఏడీలు రాజలింగం, లక్ష్మణ్, డీఈలు శ్రీనాథ్రెడ్డి, భిక్షపతి, యాదయ్య ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.