కుత్బుల్లాపూర్,జూలై27: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం పేట్ బషీరాబాద్లోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించేలా అధికారులు సత్వర చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల వాసులు, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.