గాజులరామారం, జూలై 17 : హరితహారం కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. శనివారం గాజులరామారం డివిజన్ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లో డ్రోన్ సహాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ఆయనతో పాటు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, డీసీ రవీందర్కుమార్, సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దోమల నివారణకు వినియోగించిన డ్రోన్లను సీడ్ బాల్స్ వెదజల్లేందుకు వాడుతుండటంతో పచ్చదనాన్ని మరింతగా విస్తృతంగా పరచవచ్చన్నారు. పచ్చదనంతో యాంత్రికతను వినియోగించటం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచేందుకు ఆస్కారం కలుగుతుందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని తలపించేలా అన్ని హంగులతో త్వరలోనే అర్బన్ ఫారెస్టు బ్లాక్ ప్రారంభానికి సిద్ధం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ్రామిరెడ్డి, నాయకులు ఇంద్రసేనగుప్త, సుంకరి సాయిప్రతాప్, పర్శ శ్రీనివాస్యాదవ్, ఆబిద్, వార్డు సభ్యులు అజయ్ ప్రసాద్గుప్త, సురేశ్, ఇబ్రహీం, అబు, చెట్ల వెంకటేశ్, సంధ్యారెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.