కుత్బుల్లాపూర్ జోన్ బృందం, జూలై 10: కాలుష్యాన్ని తగ్గించి, రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం నిర్వహిస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిలో జరిగిన తెలంగాణకు హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణి కృష్ణ, కమిషనర్ భోగీశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ భోగీశ్వర్లు, వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, నర్సింగం భరత్కుమార్, శివనూరి నవనీత మల్లేశ్, మైసిగారి సుజాత వెంకటేశ్, ఎల్లుగారి సత్యనారాయణ, మహేందర్యాదవ్, బౌరంపేట పీఏసీఎస్ డైరెక్టర్లు మదన్రావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, 7వ డివిజన్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.
132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వైష్టవి ఎన్క్లేవ్ పార్క్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం పంచతత్వ పార్కు అభివృద్ధిని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. డీసీ మంగతాయారు, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్రెడ్డి, ఈఈ కృష్ణచైతన్య, వార్డు సభ్యులు రంగు కవిత, ఇందిరారెడ్డి, కాలనీవాసులు కృష్ణమూర్తి, శ్రీకాంత్, అవినాశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,2, 3, 11, 14 వార్డుల్లో ఎమ్మెల్యే వివేకానంద్ హాజరై మొక్కలు నాటిన అనంతరం కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ రాత్లవత్ గంగయ్యనాయక్, ప్రత్యేకాధికారి ఎం.శ్రీనివాస్రెడ్డి, కమిషనర్ జి.రఘు, డీఈఈ విజయలక్ష్మి, కౌన్సిలర్లు అదమ శకుంతల, జందా మంజూల, జ్యోత్స్నాదేవి, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ముగింపు సందర్భంగా దూలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హాజరై మొక్కలు నాటారు. పది రోజుల పాటు జరిగిన హరితహారం, పట్టణ ప్రగతిలో పాల్గొన్న కొంపల్లి మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రాజు, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు భోగీశ్వర్లు, జి.రఘుతో పాటు మాజీ ఎంపీపీ సన్నా కవితతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గాజులరామారం డివిజన్ పరిధిలోని మిథిలానగర్, ఆర్కే లే అవుట్, కైసర్నగర్ వెళ్లేదారిలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 10వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట డివిజన్ అంజయ్యనగర్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం సుభాష్నగర్ డివిజన్ పరిధి భజరంగ్ మైదానంలో, రాజీవ్గృహకల్ప సముదాయంలో మాజీ కార్పొరేటర్ జి.సురేశ్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. డీఈ పాపమ్మ, రాజీవ్గృహకల్ప సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివగౌడ్తో పాటు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
చింతల్ డివిజన్ పరిధి హెచ్ఎంటీ పైపులైన్ రోడ్డు, రోడామేస్త్రీనగర్లో శనివారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంబీపూర్రాజు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రశీదాబేగం, కె.జగన్, డీసీ రవీందర్కుమార్, శానిటేషన్ డీఈ ప్రశాంతి, శానిటేషన్ సూపర్వైజర్లు దుర్గారావు, పోతారెడ్డి, చింతల్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహ్మద్ఫ్రీతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి వెంకట్రామిరెడ్డినగర్, సంజయ్గాంధీనగర్, రంగారెడ్డినగర్, మారుతినగర్, బీజేఆర్నగర్లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్శేఖర్గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఈ భానుచందర్, ఏఈలు ఆశ, నరేందర్, రోహిణి, పూజితలతో పాటు ఆయా కాలనీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.