కుత్బుల్లాపూర్, మే 18 : మహమ్మారి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు ముఖ్య భూమిక పోషించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగ ళవారం చింతల్ డివిజన్ పరిధిలోని పలు సంక్షేమ కాలనీల ప్రతినిధులతో స్థానిక సమస్యలను తెలుసుకుంటూ త్వర లో రూ.40.20 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను తరిమికొట్టడంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. దానికంటే ముందు ప్రజలంతా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించి ఇంట్లోనే ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో త్వరలోనే మిగిలిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సకాలంలో పూర్తి చేసేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కార్పొరేటర్ రషీదా, ఆయా కాలనీల ప్రతినిధులు చందు, విజయలక్ష్మి, సంతోష్, గోపాల్, బుచ్చిరెడ్డి, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.