కుత్బుల్లాపూర్,మే16 : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎస్ఆర్డీపీ పథకం కింద మంజూరైన రూ.90 కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఫాక్స్సాగర్ కాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి అపరిష్కృతంగా నెలకొన్న ఫాక్స్సాగర్ చెరువు కాల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుభాష్నగర్ డివిజన్లో వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీలో రూ.24.50 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టే సీసీరోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో సుభాష్నగర్ డివిజన్ కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతాసురేశ్రెడ్డి, సంక్షేమ సంఘాల ప్రతినిధులు బస్వరాజ్, చెన్నయ్య, శ్రీనివాస్, హరి, రమణారెడ్డి, నాగేందర్గౌడ్, సరోజ, సుధాకర్ పాల్గొన్నారు.