కుత్బుల్లాపూర్,మే9: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో త్వరలో రూ.2 కోట్ల 58లక్షలతో ప్రారంభించే పలు అభివృద్ధి నిర్మాణాలపై ఆయా కాలనీల సంక్షేమ అసోసియేషన్ సభ్యులతో పాటు కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కాలనీలో మౌలిక సదు పాయాల కల్పన కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, కొవిడ్ విపత్కర సమయంలో కూడా అభివృద్ధి పనులకు ఆటంకాలు రాకుండా ఉండేందుకు త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.