జీడిమెట్ల, నవంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు ‘వి హబ్’ ను నెలకొల్పిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ పరిధి కృష్ణమూర్తినగర్ కాలనీలో ‘వి హబ్ ’ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ నేషనల్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంబ్రాయిడరీ స్టూడియోను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కృష్ణమూర్తినగర్కు చెందిన గుమ్మడి భవ్య తన ఎంబ్రాయిడింగ్ నైపుణ్యంపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 600 మంది కొత్త బిజినెస్ ఐడియాలతో ‘వి హబ్’ లో ప్రజెంటేషన్ ఇవ్వగా భవ్య ఐడియాలజీని గుర్తించి ఎస్బీఐ ద్వారా రుణం మంజూరు చేసిందన్నారు. ఈ స్టూడియో ద్వారా ఎంబ్రాయిడరీ రంగంలో ఆసక్తి ఉన్న 100 మందికి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఆపరేటింగ్ను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు.
మహిళలు సాధించలేనిది ఏదీ లేదు
మహిళలు పట్టుదలతో ముందుకు వస్తే సాధించలేనిది అంటూ ఏదీ లేదన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేయడమే ‘ వి హబ్’ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుడిమెట్ల హేమలతా సురేశ్రెడ్డి, కృష్ణమూర్తి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.వజీర్, నవీన్కుమార్, భాగ్యలక్ష్మీ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాగర్రెడ్డి, ప్రోగ్రాం కో- ఆర్డినేటర్లు అన్నపూర్ణ, తరుణ్, నవీన్కుమార్, నాయకులు సాంబయ్య, కృష్ణానాయక్, సునీల్కుమార్, అడపా శేషు, మంగమ్మ, పద్మలతారెడ్డి, మల్లీశ్వరి, పద్మజారెడ్డి, సుజాత, శ్వేత, సునీత పాల్గొన్నారు.
అపురూపకాలనీలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం
సుభాష్నగర్ డివిజన్ పరిధి అపురూపకాలనీలో నూతనంగా నిర్మించిన కాపు సంఘం కమ్యూనిటీ హాల్ను ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలతా సురేష్రెడ్డి, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాఘవులు, నాయకులు వెంకటేశ్వర్రావు, సత్యనారాయణ, రామకృష్ణరావు, ఎం.ఎస్.వాసు, వెంకటరత్నం, ఏసుబాబు, కృష్ణమూర్తి, నరేంద్రబాబు, రామారావు, శ్రీనివాస్, సీతారాం, కుమార్, రాధాకృష్ణ, మహిళా అధ్యక్షురాలు మంగమ్మ పాల్గొన్నారు.