దుండిగల్, సెప్టెంబర్ 21 : కార్యకర్తలను కలుపుకొని సమష్టిగా ముందుకెళ్లి…టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా నూతన అధ్యక్ష,కార్యదర్శులు, కమిటీ సభ్యులు సైనికుల్లా పని చేయాలని కుత్బు ల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియ మితులైన రంగరాయ ప్రసాద్కు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పార్టీ కోసం పని చేసినప్పుడే తగిన అవకాశాలు వస్తాయన్నారు. మరింత ఉన్నత స్థానాలకు రావా లంటే పార్టీని, కార్యకర్తలను కలుపుకొని ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవారధులుగా ఉంటూ పని చేయాలన్నారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గడపగడపకు గులాబీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమం లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ధన్రాజ్యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
గాజులరామారం, సూరారం డివిజన్ల నూతన కమిటీ అధ్యక్షకార్య దర్శులతో పాటు కమిటీ సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకా నంద్ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగు చ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ మహిళా కమిటీ అధ్యక్షురాలు టి.సంధ్యారెడ్డి, ఉపాధ్యక్షురాలు రమాదేవితో పాటు కమిటీ సభ్యులు, సూరారం డివిజన్ అధ్యక్షకార్యదర్శులు పుప్పాల భాస్కర్, సిద్ధిక్, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.