దుండిగల్,సెప్టెంబర్ 19 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన టీఆర్ఎస్ కమిటీల నియామకం పూరైంది. దుండిగల్ మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తిస్థాయి కమిటీని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ప్రతినిధులకు నియామకపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్తో అభివృద్ధి, సంక్షేమం సాధ్య మవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగరాజుయాదవ్, మాజీ జడ్పీవైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, కౌన్సిలర్ శంభీపూర్కృష్ణ, సీనియర్ నాయకులు బూరుగుబావి హన్మంతరావు, నేతలు పాల్గొన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిగా గాగిళ్లాపూర్కు చెందిన సీనియర్ నేత మద్దికుంట సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా కొల్తూరి మల్లేశ్, ఉపాధ్యక్షులుగా శామీర్పేట రంగయ్య, రమేశ్యాదవ్, శివయాదవ్, బండారు మహేశ్, సంయుక్త కార్యదర్శులుగా తిరుమలేశ్, రమేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పడాల మనోజ, యువజన విభాగం అధ్యక్షుడిగా మైసిగారి శ్రీకాంత్, బీసీ సెల్ అధ్యక్షుడిగా రాజశేఖర్యాదవ్లు ఎన్నికయ్యారు.
నిజాంపేట కార్పొరేషన్ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా రంగరాయ ప్రసాద్ను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా పద్మప్రసాద్, అజయ్చౌదరి, ప్రధాన కార్యదర్శులుగా దూసకంటి వెంకటేశ్, నాగరాజుయాదవ్లను ఎన్నుకున్నారు.