కుత్బుల్లాపూర్జోన్బృందం, సెప్టెంబర్18: టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నూతన డివిజ న్ కమిటీల సారథులు సైనికుల్లా పని చేయా లని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రం గారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్రాజులు పిలుపునిచ్చారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో 125 గాజులరా మా రం, 126 జగద్గిరిగుట్ట, 127 రంగారెడ్డి నగర్ డివిజన్, 129 సూరారం డివిజన్, 130 సుభాష్నగర్ ఐదు డివిజన్ల పరిధిలో పార్టీ డివిజన్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ముఖ్యఅతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు నియా మకపత్రాలను అధి కారికంగా అందజే శారు.
ఈ సందర్భం గా వారు మాట్లాడు తూ టీఆర్ఎస్ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని, స్వరాష్ర్టా న్ని సాధించుకున్న తర్వాత ప్రజలకు సుస్థిరమైన పరిపా లనను అందించే దిశగా ఎదిగిందన్నా రు. ఇదే స్ఫూర్తితో టీఆర్ ఎస్ పార్టీని పునాదుల నుంచి మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన వార్డు, బస్తీ, డివిజన్ కమిటీల నేతృత్వంలో రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవే యాలని పిలుపునిచ్చా రు.
పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని భరోసాను ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షకా ర్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా, యువజన, సోషల్ మీడియా కమిటీ సభ్యులను ఏకగ్రీ వంగా నియమించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, బి.విజయ్శేఖ ర్గౌడ్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి.సురేశ్రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27, 28 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ కమిటీలను శనివారం ఏకగ్రీవంగా నియమించుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారికి మేయర్ కొలన్ నీలాగో పాల్ రెడ్డిధ్రువీకరణ పత్రా లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహారెడ్డి,బొర్రా చందు తదితరులు పాల్గొన్నారు.