కుత్బుల్లాపూర్/గాజులరామారం, సెప్టెంబర్ 17 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని ఎంకేఆర్ ఫంక్షన్ హాల్లో స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ డివిజన్ కమిటీ ఎన్నికకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రుద్ర అశోక్, ప్రధాన కార్యదర్శిగా హజ్రత్అలీ, యువజన విభాగం అధ్యక్షు డిగా రాయి విఘ్నేష్, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మహిళా కమిటీ సభ్యులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బస్తీలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు.
ఢిల్లీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులే టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రశంసిస్తున్నారన్నారు. విపక్షాలు ఇకనైనా కళ్లు తెరుచుకుని అసత్యప్ర చారాలు మానుకుంటే మంచిదన్నారు. కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ అధ్యక్షుడు మల్లేష్గౌడ్, నాయకులు సయ్యద్ రశీద్, కృష్ణగౌడ్, వేణుయాదవ్, ఎత్తరి మారయ్య, యూత్ నాయకులు కొ లుకుల జైహింద్, బాబుగౌడ్, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో గులాబీ జెండా చిరస్థాయిగా నిలిచిపోయేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికైన సందర్భంగా విజ యరామిరెడ్డి.. స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావుతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యేను మ ర్యాద పూర్వకంగా కలి సి సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2,3,5 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ వార్డు కమిటీలను చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, వైస్ చైర్మన్ గంగయ్యనాయక్తో పాటు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడవ వార్డు అధ్యక్షుడిగా నరహరి, ఉపాధ్యక్షుడిగా విజయ్కుమార్, రెండవ వార్డులో కౌన్సిలర్ జంద మంజూల ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మణ్గౌడ్, 5వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా బి.గోపియాదవ్, ఉపాధ్యక్షులుగా ఖాదీర్లను ఎన్నుకున్నారు.