పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బస్తీ కమిటీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా డివిజన్ కమిటీల సభలకు ఎమ్మెల్యే హాజరై పరిశీలించిన అనంతరం బస్తీ కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడినప్పుడే తగిన గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని, ఎవరు నిరుత్సాహపడరాదని కోరారు. టీఆర్ఎస్ పార్టీని మరింత విస్తృతం చేసేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.