కాప్రా : సీనియర్ సిటిజన్లు సమాజానికి మార్గదర్శకులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్లో రూ.17.5లక్షల వ్యయంతో నిర్మించిన వయో వృద్ధుల సంక్షేమ భవనం (సీనియర్ సిటిజన్స్ భవనం) ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి మాట్లాడుతూ జీవితంలో అపారమైన అనుభవాన్ని గడించిన వయో వృద్ధులు సమాజానికి ప్రయోజనం చేకూరేలా సేవా కార్యక్రమాలు చేపడ్తూ ప్రజా భిమాన్ని చూరగొనాలని అన్నారు.
ఈ భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శిరీష సోమశేఖర్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పావనీ మణి పాల్ రెడ్డి, కొత్తరామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బేతాల బాలరాజు, పులిచేరాలు, కాసం మహిపాల్రెడ్డి, షేర్మణెమ్మ, మణిపాల్రెడ్డి, సురేందర్, రమేష్చారి, సీనియర్ సిటిజన్స్ సంక్షేమసంఘం అధ్యక్షుడు బి. ఎల్లారెడ్డి, విఠలాచారి, పార్థసారధి, సంఘం నేతలు, స్థానికులు పాల్గొన్నారు.