ఉప్పల్ : చిలుకాగర్ గుట్ట ప్రాంతంలోని అగ్నిప్రమాద బాధిత కుటుంబసభ్యులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పరామర్శించారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి, ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్రెడ్డి, కొంపెల్లి రవీందర్, పిట్టల నరేష్ ముదిరాజ్లు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అదజేశారు.