ఉప్పల్, జూన్ 17 : ప్రభుత్వం అందించే పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్లోని కేకేఆర్ గార్డెన్లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ఈ మేరకు 430 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు వరం లాంటిదని చెప్పారు. పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి పనులు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ గౌతమ్కుమార్, డిప్యూటీ తాసీల్దార్ రఫీ, ఆర్ఐలు రామకృష్ణారెడ్డి, షాహీన్, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్రెడ్డి, ప్రభుదాస్, రజితాపరమేశ్వర్రెడ్డి, శ్రీవాణి వెంకట్రావు, లేతాకుల రఘుపతిరెడ్డి, వేముల సంతోష్రెడ్డి, అరటికాయల శాలిని, భాస్కర్ ముదిరాజ్, పల్లా కిరణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.