జీడిమెట్ల, అక్టోబర్ 17 : ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు… అందుకే వెళ్లిపోతున్నా’… అంటూ ఓ భర్త తన భార్యకు లేఖ రాసి.. అదృశ్యమయ్యాడు. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…… మెదక్ జిల్లాకు చెందిన హారికాకు మహబూబ్నగర్కు చెందిన నవీన్కుమార్ (27)తో పెద్దల సమక్షంలో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. షాపూర్నగర్ కళావతినగర్లో దంపతులు నివాసముంటున్నారు. నవీన్కుమార్ ఎస్ఆర్నగర్లో ఓ టైలర్ షాపులో ఫ్యాషన్ డిజైనర్గా పని చేస్తున్నాడు. దసరా రోజు తన భార్యను బస్సు ఎక్కించి పుట్టింటికి పంపించాడు. అదే రోజు సాయంత్రం నవీన్కుమార్కు భార్య ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. మరుసటి రోజు నవీన్కుమార్ ‘నీ బ్యాగ్లో లెటర్ ఉంది చూడాల’ని హారికాకు మెసేజ్ పంపాడు. లెటర్ను తీసి చూడగా, అందులో పై విధంగా రాసి ఉంది. కుటుంబసభ్యుల వద్ద వాకబు చేసినా..ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.