మేడ్చల్, జూలై10 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ రూరల్/శామీర్పేట : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గణనీయంగా అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, కార్మిక శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి అన్నారు. పల్లె,పట్టణ ప్రగతిని 10 రోజులతో ఆపకుండా నిరంతరం కొనసాగించాలని, ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు..ప్రతిరోజు మున్సిపాలిటీని శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమయానికి చక్కటి వర్షాలు పడుతున్నాయని, హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పల్లె,పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం కండ్లకోయ, శామీర్పేట మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మొక్కలు నాటి, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడారు. పాత మున్సిపా లిటీలతోపాటు నూతన మున్సిపాలిటీలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయని, మున్సిపాలిటీలకు నిధులు కొరత లేదన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించడంతోపాటు వాటిని నాటి సంరక్షిస్తున్నారో లేదో పరిశీలించాలని సూచించారు. పట్టణలు, పల్లెలు తేడాలేకుండా, ఇల్లు లేని నిరుపేద ఉండకూడదని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10 రోజులపాటు నిర్వహించిన హరితహారం,పల్లె,పట్టణ ప్రగతి విజయంతమైందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, కండ్లకోయ మున్సిపల్ చైర్పర్సన్ మద్దుల లక్ష్మి, వైస్ చైర్మన్ ప్రభాకర్, అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, కమిషనర్ అమరేందర్రెడ్డి, పట్టణ ప్రగతి ప్రత్యేకాధికారి రామచందర్, జడ్పీటీసీ అనితలాయ్య, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొందరికి పదవులు రాగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి తలసాని సూచించారు. మాకు మాట్లాడేశక్తి ఉందని, సంస్కారహీనంగా నడుచుకోదలుచుకోలేదని చెప్పారు. కేంద్రం నుంచి దమ్మిడి పైసా తేలేని వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆంధ్రా ప్రాంతానికి నీళ్లు పోతున్నా పట్టించుకోకపోవడం అవివేకమన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. శనివారం మేడ్చల్లో మంత్రులు మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.