జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 7వ డివిజన్కు చెందిన భారతమ్మ కు ,కనకయ్యలకు సీఎం సహాయనిధి నుంచి ముంజూరైన చెక్కులను కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి సూచన మేరకు డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో లబ్ధిదారుల కుటుంబసభ్యులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మెట్టు వెంకన్న, కాలనీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.