పీర్జాదిగూడ : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం బోయిన్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రికి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఉత్సాహంగా మంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.