మేడ్చల్, సెప్టెంబర్ 20 : సమన్వయంతో పని చేసి పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని అధ్యక్ష, కార్యదర్శులకు మంత్రి మల్లారెడ్డి సూచించారు. మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను మేడ్చల్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. మేడ్చల్ మండల పార్టీ అధ్యక్షుడిగా దయానంద్, ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్, శామీర్పేట మండల అధ్యక్షుడిగా సుదర్శన్, యువజన అధ్యక్షుడుగా నర్సింహా రెడ్డిని ఎన్నుకున్నారు. మూడుచింతపల్లి మండల అధ్యక్షుడిగా కొల్తూర్కు చెందిన మల్లేశ్ గౌడ్ ఎంపిక కాగా ప్రధాన కార్యదర్శిగా జగన్గూడకు చెందిన అనిల్రెడ్డి ఎంపికయ్యాడు. అనంతరం ఏకగ్రీవంగా ఎంపికైన వారిని మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.