పీర్జాదిగూడ, జూన్ 6: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో పేదలకు తమ వంతు సహకారం అందించేదుకు బ్లేస్ ఇండియా సామాజిక సంస్థ, లోక్ ఫౌండేషన్లు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి కొవిడ్-19 ఐసొలేషన్ సెంటర్లో మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో లోక్ ఫౌండేషన్ సహకారంతో పేదలకు కొవిడ్ సేఫ్టీ కిట్లు, మందులు, మాస్కులు అందజేశారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, సుభాశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూన్ 6: ఆపదలో ఉన్న కార్మికులను తోటి కార్మికులు ఆదుకునే సంప్రదాయం ఆదర్శనీయమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కేవీ యూనియన్ ఆధ్వర్యంలో మేడ్చల్లోని రాణే ఇంజన్ వాల్వ్, సనోఫీ హెల్త్ కేర్, విద్యుత్ కంట్రోల్ సిస్టం ఎంప్లాయీస్ యూనియన్ల సహకారంతో 200 మంది మేడ్చల్ ప్రాంత ఆటో కార్మికులకు ఆదివారం మేడ్చల్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఆటో కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ ఆటో టాక్సీని రద్దు చేసి ఆదుకున్నారని అన్నారు.
ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించారని చెప్పారు. టీఆర్ఎస్కేవీ యూనియన్ నిరంతరం కార్మికుల అభ్యున్నతికి పని చేస్తున్నదని, నేడు ఆటో కార్మికులను ఆదుకోవడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, యూనియన్ నాయకులు సత్యనారాయణ, రమేశ్, నాగరాజు, రాజశేఖర్, యాదగిరి, సంజీవులు, సాయిలు, ఆటో యూనియన్ నాయకులు పరమేశ్, విజయ్రావు, వెంకటేశ్, కృష్ణ, రమేశ్గుప్త, కాళేశ్వర్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.