మేడ్చల్ : ఉపాధ్యాయులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. నాగారం మున్సిపాలిటీలో బుధవారం రాత్రి నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల ఉపాధ్యాయులతో ఎమ్మె ల్సీ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీవీ బిడ్డను భారీ మోజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు.పట్టభద్రులంతా వాణీదేవి వైపే ఉన్నారని, విద్యావిధానంపై పట్టున్న సురభివాణీదేవిని గెలిపిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు రామేశ్వర్గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీధర్, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కీసర ఎంపీపీ ఇందిరా, కీసర సర్పంచ్ నాయకపు మాధురి, కీమండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు,ముఖ్యనేతలు ఉన్నారు.
అబిడ్స్: రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని, అందుకే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం అడ్వకేట్స్ అందరూ టీఆర్ఎస్ అభ్యర్థిసురభివాణీదేవికి మద్దతుగా నిలుస్తామని ముస్లిం అడ్వకేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, వక్ఫ్బోర్డు సభ్యులు వహీద్ అహ్మద్ స్పష్టం చేశారు. నగరంలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో మైనార్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, బార్ కౌన్సిల్ సభ్యులు జకీర్ హుస్సేన్ జావిద్, మహ్మద్ముజాఫరుల్లా ఖాన్,నిసార్అహ్మద్ పాల్గొన్నారు.తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. బుధవారం మింట్ కాంపౌండ్లోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, నాసర్ షరీఫ్, వీరస్వామి, కె.వెంకటేశ్వర్లు, అనిల్, మధుసూదన్, పరమేశ్, అనురాధ, హరీశ్కుమార్, రాజేశ్, శ్రీకాంత్, కొండారెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి. ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. తెలంగాణ అభివృద్ధికి కావాల్సింది ప్రశ్నించే గొంతులు కాదు..సమస్యలు పరిష్కరించే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి.కొన్నేండ్లుగా బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని, ఇటు టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నాను. – రిటైర్డు బ్యాంకు మేనేజర్, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు సోమాజిగూడ్ ప్రెస్క్లబ్లో బుధవారం తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్, టీఎన్జీస్ మాజీ చైర్మన్ రాకేశ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మార్త రమేశ్, ఆకుల నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.