ఘట్కేసర్ రూరల్, జూలై 9 : పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చౌదరిగూడలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం చౌదరిగూడలో రూ.1.30 కోట్లు , కాచవానిసింగారంలో రూ.1.73 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలంలో మరొక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
చౌదరిగూడలో నెలకొన్న తాగునీటి సమస్యను 15 రోజులలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, సీఈవో దేవసహాయం, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఎంఏ సత్తార్, ఎంపీడీవో అరుణ, పంచాయతీ ప్రత్యేకాధికారి వై.శారద, కాచవానిసింగారం సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి, ఎంపీటీసీలు వెంకట్రాం రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామారావు, పంచాయతీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, జూలై 9 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బండమాదారం, శ్రీరంగవరం, మైసిరెడ్డిపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో వైకుంఠధామం, డంపింగ్యార్డు, నర్సరీలను పరిశీలించారు. జడ్పీటీసీ శైలజారెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ నందారెడ్డి, శ్యామలాప్రభాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రత్యేక అధికారి వినోద్కుమార్, ఎంపీడీఓ శశిరేఖ, ఎంపీఓ వినూత్న రెడ్డి పాల్గొన్నారు.
కీసర : హరితహారంలో ప్రజలందరిని భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందని డీపీఓ రమణమూర్తి పేర్కొన్నారు. గోధుమకుంటలో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఆయన పాల్గొని సర్పంచ్ మహేందర్రెడ్డితో కలిసి ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఎంపీడీఓ, ఎంపీఓ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్ : గ్రామాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని అవుషాపూర్లో జేసీబీతో గ్రామంలోని వీధులు, పరిసరాలను పరిశుభ్రం చేయించారు.
శామీర్పేట : పల్లె ప్రగతిలో భాగంగా మూడుచింతలపల్లి మండలం జగన్గూడ గ్రామంలో పేట్బషీర్బాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ సుధీర్కుమార్, ఎంపీపీ హారికా మురళీగౌడ్, సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి మొక్కలు నాటారు