కంటోన్మెంట్, జూన్ 30 : ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుబాటులో ఏర్పాటు చేసిన సెంటర్లలో అర్హులందరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బుధవారం బోయిన్పల్లి 6వ వార్డులోని మల్లారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, కేశవరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో రాజకుమారి, విద్యావతి, విజయ్, నివేదిత, సదానంద్గౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం దండుమారమ్మ దేవస్థానంలో అమ్మవారి గోపురం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, జక్కుల మహేశ్వర్రెడ్డితో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.