మేడ్చల్ రూరల్, జూన్ 19 : హరితహారంతో ఆకుప చ్చ తెలంగాణ సాధ్యపడిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొంపల్లి వంతెన సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ మానసపుత్రికగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడుతుందన్నారు. నియోజవకర్గంలోని ప్రతి మున్సిపాలిటీ, ప్రతి గ్రామం హరితహారంలో ప్రతి యేడు వానకాలంలో నాటిన మొక్కల కారణంగా పచ్చదనంతో వికసిస్తున్నాయన్నారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి పక్కన 5కిలో మీటర్ల పొడవునా ప్రభు త్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్రెడ్డి, కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, చింత పెంటయ్య, వీణాసురేందర్గౌడ్, రజితావెంకటేశ్ ముదిరాజ్, బేరి బాలరాజు, అమరం సరస్వతి, హంసరాణి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కో-ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కందాడి నరేందర్ రెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, యూనస్పాషా, ఫిలిప్స్, సుధాకర్, రాజేందర్ ముదిరాజ్, రవీందర్, ఆధిత్యరాజ్ సింగ్, లక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భానుచందర్ పాల్గొన్నారు.
శామీర్పేట, జూన్ 19 : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ గ్రామాభివృద్ధికి కృషిచేయాలని ఎంపీపీ హారికామురళీగౌడ్, జడ్పీటీసీ హరివర్ధన్రెడ్డి అన్నా రు. మూడుచింతల్పల్లి కొల్తూర్, శామీర్పేట మండలంలోని అలియాబాద్లో శనివారం గ్రామ సభలు నిర్వహించారు. అనంతరం గ్రా మాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ శిల్పయాదగిరి, ఉపసర్పంచ్ జైపాల్రెడ్డి, వార్డు సభ్యులు గ్రామస్తు లు పాల్గొన్నారు.
ఘట్కేసర్, జూన్ 19 : శివారు ప్రాంతాలైన పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో హరితహారం నిర్వహణకు ఏర్పాట్లను అధికారులు మమ్మరం చేశారు. ఈ ఏడాది ఘట్కేసర్ మున్సిపాలిటీ 2లక్షల 15వేల మొక్కలు, పోచారం మున్సిపాలిటీ 2లక్షల 9వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు అధికారులు ము న్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
కీసర, జూన్ 19 : ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నదే తమ ధ్యేయమని యాద్గార్పల్లి, భోగారం సర్పంచ్లు పుట్ట రాజు ముదిరాజ్, సుంకరి కవితాజైహింద్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని భోగారం, యాద్గార్పల్లిలో శనివారం హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలు చోట్ల మొక్కలు నాటా రు. కార్యక్రమంలో ఎంపీడీవో పద్మావతి, ఎంపీటీసీలు జూపల్లి వెంకటేశ్, సింగిరెడ్డి వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్లు తర్రి మల్లేశ్యాదవ్, జానకీరాం, పంచాయతీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.