మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. నాగారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన రూ.2.20 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు వార్డుల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పేద ల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, అనేక పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణను నంబర్వన్ స్థానం లో ఉంచారన్నారు.
నిధుల కొరత లేకుండా అభివృద్ధి పనులు వేగంగా జరిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్ర త్యేక శ్రద్ధ వహిస్తున్నదన్నారు. అనంతరం 18వ వార్డు సాయిసంజీవని కాలనీకి చెంది న శ్రీకాంత్కు రూ. 60 వేల సీఎం రీలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ.వాణి రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్యాదవ్, కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కౌకుట్ల అనంత్ రెడ్డి, సుమిత్ర సురేశ్, సరిత, లావణ్య శ్రీనివాస్, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, సబితాఆంజనేయులు గౌడ్, మమతాకృష్టారెడ్డి, రేణుక, అనితాసుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, నాగారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, నాయకులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు
పాల్గొన్నారు.