మేడ్చల్ రూరల్, జూన్ 16 : పచ్చదనంతోనే భావితరాలకు భవిష్యత్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గౌడవెల్లి గ్రామ పరిధిలోని సాకేత్ గృహ సముదాయంలో బుధవారం ఎంపీపీ పద్మాజగన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పచ్చదనం పెంపొందించడానికి హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భావితరాల భవిష్యత్, పర్యావరణ హితం కోసం సీఎం కేసీఆర్ హరితహారం మహాయజ్ఞానికి శ్రీకా రం చుట్టారన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గణనీయంగా పచ్చదనం పెరిగిందన్నారు.
కాంక్రీట్ జంగిల్గా మారిన మేడ్చల్ లాంటి జిల్లాలో మొక్కలను విరివిగా పెంచడం అవసరమన్నారు. ప్రతిసారి లాగానే ఈ యేడు కూడా హరితహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజాప్రతినిధులు, నేతలకు మంత్రి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేత జగన్రెడ్డి జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం జగన్రెడ్డిని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర అటవీఅభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్లు మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, దీపికానర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, చీర్ల రమేశ్, ఎంపీపీ ఎనుగు సుదర్శన్రెడ్డి, ఇందిరా, లక్ష్మీనారాయణ, హారికామురిళీగౌడ్, మూడుచింతపల్లి జడ్పీటీసీ హరివర్దన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్గౌడ్, పీఏసీఎస్ల చైర్మన్లు రణదీప్రెడ్డి, సురేశ్రెడ్డి, నాయకులు మద్దుల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్, బాలరాజ్, జైపాల్రెడ్డి, చింత పెంటయ్య, కో-ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, సుధాకర్, ఫిలిప్స్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.