మేడ్చల్, జూన్ 14: సీఎం సహాయ నిధితో పేదలకు ఎంతో మేలు జగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్కు చెందిన సుగుణ, లక్ష్మికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు గణేశ్, మహేశ్, మేడ్చల్ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు జగన్రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, జూన్ 14 :గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన లక్ష్మి అనారోగ్యం కారణంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. అనంతరం ఆమె మున్సిపాలిటీ చైర్పర్సన్ , మంత్రి సహకారంతో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆమెకు రూ.50వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్రెడ్డి సోమవారం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు మల్లికార్జున్ ముదిరాజ్, జైపాల్రెడ్డి, బాలరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కమిషనర్ అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.