పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగర పాలక ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు అన్ని రంగాల్లో ప్రతి డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి హాజరయ్యారు. నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, మద్ది యుగేందర్రెడ్డి, నవీన్రెడ్డి, అనంతరెడ్డి, హరిశంకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, అమర్పింగ్, సుభాష్నాయక్, బచ్చరాజు, బైటింటి శారద, బండి రమ్య, కౌడె పోచయ్య, పాశం శశిరేఖ బుచ్చియాదవ్, ప్రసన్నలక్ష్మి, మహేశ్వరి, పిట్టల మల్లేశ్, కమిషనర్ బి.శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.