శామీర్పేట, జూన్ 11: పరిపాలనను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్వేతామహంతితో కలిసి రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరం చుట్టూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కార్పొరేషన్లుగా, మున్సిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధికి బాటలు వేస్తున్నదన్నారు.
జవహర్నగర్ నూతన రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నేతృత్వంలో కార్పొరేషన్లు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు. జవహర్నగర్లో ఇప్పటికే ఎనమిదిన్నర కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. జవహర్నగర్లో ఇంటింటి కనెక్షన్స్ లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, సీఎం సహకారంతో వాటర్ వర్క్స్ కోసం రూ.10 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని త్వరలోనే టెండర్ పనులు పూర్తి చేస్తామన్నారు. జవహర్నగర్లో ఇండ్లకు రెగ్యూలరైస్ చేసే బాధ్యత తమదేనని నివాసం ఉంటున్న ప్రజలకు ఇంటి నంబర్లు, నీరు, పైప్లైన్, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు ఏర్పాటు చేస్తానమి హామీ ఇచ్చారు.
జవహర్నగర్ నూతనంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్కు అప్పగించాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు మల్లయ్య, రవి, తహసీల్దార్ గౌతమ్కుమార్, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్రెడ్డి, తహసీల్దార్లు నాగమణి, గౌరివస్తల, రామకృష్ణారెడ్డి, కమిషనర్ గోపి, కార్పొరేటర్లు వేణు, నిహారిక, లావణ్యసతీశ్గౌడ్, శాంతికోటేశ్గౌడ్, శారదమనోహర్రెడ్డి, లలితయాదవ్, మురుగేశ్, రాంచందర్, రాజ్కుమార్, సతీశ్, లక్ష్మీకృష్ణగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు భూమపాల్, శోభారెడ్డి, ఫారూక్, నర్సయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్గుప్తా, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.