బోడుప్పల్, జూన్ 11 : పారదర్శక, నీతివంతమైన పాలన అందిస్తూ…అభివృద్ధి,సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తుందని కార్మిక, ఉపాధికల్పన శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ నగర పరిధిలో శుక్రవారం మంత్రి మల్లారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. రూ.6.50కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… బోడుప్పల్కు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనున్నట్లు తెలిపారు.
1వ డివిజన్ వెంకట్సా యి, శివదుర్గా నగర్ తాగునీటి పైపులైన్ పనులకు రూ.5.60కోట్లు, 3వ డివిజన్ సీపీఆర్ఐ కాలనీ సీసీరోడ్డు నిర్మాణ పనులకు రూ.21లక్షలు, ద్వారకానగర్ యూజీడీ పనులకు రూ.25.50లక్షలు, 21వ డివిజన్ బాలాజీహిల్స్ సీసీ రోడ్డు పనులకు రూ.15లక్షలు,10వ డివిజన్ మెక్డోవెల్స్ కాలనీ సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం చెంగిచర్ల పొచమ్మ కుంట, చింతల చెరువును స్థానిక డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్తో కలిసి పరిశీలించారు.
బోడుప్పల్ చెంగిచర్ల భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నట్లు తెలిపారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ సమన్వయంతో చెంగిచర్ల డ్రైనేజీని నేరుగా మూసీలోకి చేరేటట్లు రూపకల్పన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ర్టాన్ని దేశ ధాన్యభాండాగారంగా మార్చారని అన్నారు. 3లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తులను సృష్టించి దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.
రూ.80లక్షల నిధులతో రా చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయని, మరో రూ.6 కోట్లతో రాచెరువును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాచెరువు నుంచి సుద్దకుంట వరకు నాలాను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్,డీఈ కురుమయ్య, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు జంగయ్యయాదవ్, చందర్గౌడ్, సుమన్నాయక్, మహేశ్వరి, సుగుణబాలయ్య, నాయకులు రవిగౌడ్, వెంకటేశ్,శేఖర్రెడ్డి శివదుర్గా కాలనీ అధ్యక్షుడు విద్యాసాగర్,హరికృష్ణ కాలనీవాసులు పాల్గొన్నారు.
కీసర, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థికసాయం అందించి నిరుపేదల ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని యాద్గార్పల్లి గ్రామానికి చెందిన దర్శన్కు శుక్రవారం ఆయన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.60వేల చెక్కును మంత్రి అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యాద్గార్పల్లి ఎంపీటీసీ వెంకటేశ్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామంలో పార్కులతో పాటు కమ్యూనిటీహాల్, ఫంక్షన్హాల్స్ను నిర్మించుకుంటే గ్రామాల రూపురేఖలు మారిపోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాంపల్లిదాయరలోని సర్వే నంబర్ 618లో 2ఎకరాలు పార్కు స్థలం,దాంతో పాటు కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్హాల్స్ నిర్మాణం కోసం 1.13ఎకరాల స్థలానికి సంబంధించిన ఆర్డన్ కాపీని శుక్రవారం మంత్రి రాంపల్లిదాయర సర్పంచ్కు అందజేశారు. కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యుడు మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు చిత్తారయ్య పాల్గొన్నారు.