శామీర్పేట, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత మండలం అయిన మూడుచింతల్పల్లి మండలంలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు 59, సీఎం సహాయనిధి చెక్కులు 20 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే రైతాంగానికి పెద్దపీట వేస్తూ నూతన ఆవిష్కరణలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. మూడుచింతల్పల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా రూ.16 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారికామురళీగౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు జామ్ రవి, సింగం ఆంజనేయులు, కృపాకర్రెడ్డి, గోపీనాయక్, జ్యోతిబల్రాంగౌడ్, అనురాధరవీందర్రెడ్డి, ఇస్తారి, విష్ణువర్ధన్ రెడ్డి, హరిమోహన్రెడ్డి, శిల్పాయాదగిరి, ఎంపీటీసీలు నాగరాజు, హనుమంత్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ రాంమోహన్, డీఈ వేణుగోపాల్, ఎంపీడీవో సువిధ, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సుదర్శన్, ప్రధాన కార్యదర్శులు చిత్తాగౌడ్, తాళ్ల జగదీశ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, మురేశ్, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడి పాల్గొన్నారు.
మూడుచింతల్పల్లి మండల పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి మూడుచింతల్పల్లి, శామీర్పేట మండలాల ప్రజలకు, లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన 30 చెక్కులను పంపిణీ చేశారు.
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 10: దమ్మాయిగూడమున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన చెందిన ఫారీదా బేగానికి రూ. 60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు కాగా గురువారం టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కౌకుట్ల తిరుపతి రెడ్డి ఆమెకు అందజేశారు. కౌన్సిలర్ నానునాయక్ పాల్గొన్నారు.