మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 9: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా ఉన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ 5వ వార్డులో రూ. 46 లక్షలు, కుందన్పల్లిలో రూ. 41 లక్షలతో నిర్మించనున్న వైకుంఠధామాల పనులకు బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో పేదల ప్రజల జీవితాల్లో మార్పు వస్తున్నదన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు సురేఖ, వెంకటేశ్, హేమలత, స్వప్న, సుజాత, శ్రీ హరిగౌడ్,రమేశ్గౌడ్, వెంకటేశ్,కో-ఆప్షన్ సభ్యులు రజిని, షాదుల్లా, అధికారులు పాల్గొన్నారు.
దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డుకు చెందిన సంతోష్కుమార్కు రూ.లక్ష, రమ్యకు రూ.32, 500, చంద్రారెడ్డికి రూ. 30వేలు, నవీన్కు రూ. 19వేలు సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా చెక్కులు మంజూ రయ్యాయి. ఆ చెక్కులను బుధవారం మంత్రి మల్లారెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, మంత్రి మల్లారెడ్డికి 8వ వార్డు కౌన్సిలర్ స్వప్న కృతజ్ఞతలు తెలిపారు.