కీసర, మే 7:పేదలందరికీ సీఎం రిలీఫ్ఫండ్ అండగా ఉం టుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన సలీంకు రూ.18,500, భీముడి రాంరెడ్డికి రూ.60వేలు సీఎం సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సోమవారం మంత్రి అందజేశారు.కార్యక్రమంలో గోధుమకుంట సర్పంచ్ మహేందర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సురేశ్ పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, జూన్ 7: టీఆర్ఎస్ పాలన సంక్షేమంలో స్వర్ణయుగంగా వెలుగొందుతుందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఎనిమిది మందికి సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.4.40 లక్షల చెక్కులను సోమవారం అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, బాలరాజు, మల్లికార్జున్ ముదిరాజ్ పాల్గొన్నారు.
పీర్జాదిగూడ,జూన్8: సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని పర్వతాపూర్ 3వ డివిజన్కు చెందిన టి.వెంకటమ్మకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.60 వేల చెక్కును సోమవారం నగరపాలక సంస్థ కార్యాల యంలో కార్పొరేటర్ శారదాఈశ్వర్రెడ్డితో కలిసి బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్, జూన్ 7 : పేదలపాలిట సీఎం సహాయనిధి వరంలా మారిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. బోడుప్పల్కు చెందిన సీసా సుశీలకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.60 వేల చెక్కును మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్యాదవ్, కృష్ణ పాల్గొన్నారు.