కంటోన్మెంట్, జూన్ 3: లోకా ఫౌండేషన్ లక్ష మందికి కొవిడ్ సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలనుకోవడం గొప్ప విషయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం బోయిన్పల్లిలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి మంత్రి బోయిన్పల్లి వాసులకు ఐసొలేషన్ కిట్లతో పాటు మందులను పంపిణీ చేశారు. కొవిడ్ కిట్లను అందజేస్తున్న లోకా ఫౌండేషన్ ప్రతినిధులను మర్రి రాజశేఖర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో లోకా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఘని, రాజులతో పాటు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.