కీసర, మే 29: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామంలోని శివసాయి ఎన్క్లేవ్ కాలనీకి చెందిన బండారి నర్సింహారెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.30వేల చెక్కును శనివారం గోధుమకుంట సర్పంచ్ ఆకిటి మహేందర్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురేశ్ పాల్గొన్నారు.
మేడ్చల్, మే 29: నిరుపేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ 16వ వార్డులోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన లక్ష్మికి మంజూరైన రూ. 42 వేల సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును ఆ వార్డు కౌన్సిలర్ ఉమా నాగరాజుతో కలిసి చైర్ పర్సన్ శనివారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.