బోడుప్పల్, మే 25: కరోనా విపత్కర పరిస్థితిలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. మంగళవారం బోడుప్పల్, పీర్జాదిగూడ జంట కార్పొరేషన్ల పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 39 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మేయర్ జక్క వెంకట్రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్తో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షా 116 అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ కమిషనర్ శ్రీనివాస్, జంట కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు లక్ష్మీరవిగౌడ్, శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కీసర, మే 25 : ఆడపిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎంతో ఆసరాగా నిలుస్తుందని కరీంగూడ సర్పంచ్ కౌకుట్ల గోపాల్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కరీంగూడ గ్రామానికి చెందిన కావాలి చంద్రకళ, బొల్లి మంగకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను మంగళవారం సర్పంచ్ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి ద్వారా ప్రతి ఆడబిడ్డ కుటుంబానికి రూ.1,00, 116 అందజేసి వారి కుటుంబంలో వెలుగులు నింపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.