మేడ్చల్ కలెక్టరేట్, మే 20 : నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీకి చెందిన రాజేశ్వరికి రూ.35 వేలు, లక్ష్మికి రూ.37 వేలు, విజయలక్ష్మికి రూ.22 వేలు, నవనీతకు రూ.22 వేలు సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ నాగాయిపల్లి సుజాతాశ్రీనివాస్ సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు నాగాయిపల్లి శ్రీనివాస్, మణికంఠ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.