దుండిగల్/కుత్బుల్లాపూర్, మే19: ప్రజలంతా ధైర్యంతో కరోనాను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. బుధవారం దుండిగల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందడంలో ఏవైనా సమస్యలుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పేట్ బషీరాబాద్ అంగడిపేటలో జ్వర సర్వే బృందంతో కలిసి ప్రజలకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ఆనంద్, ఎంహెచ్వో డాక్టర్ నిర్మల, కౌన్సిలర్ జక్కుల కృష్ణయాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.