ఘట్కేసర్ / శామీర్పేట/బోడుప్పల్, మే 17 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, ప్రజలు సైతం నిబంధనలు పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 10పడకలు, జవహర్నగర్లో 20పడకలు, బోడుప్పల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 25పడకల కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దవాఖానల్లో రెమ్డెసివిర్, పడకలు, ఆక్సిజన్లకు కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. కొవిడ్ నివారణకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా స్థానికంగా ఐసొలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు.
కొవిడ్ లక్షణాలు అధికంగా ఉంటే నియోజకవర్గంలోని మల్లారెడ్డి దవాఖానకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావనీజంగయ్యయాదవ్, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ వసంత, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు బింగి జంగయ్యయాదవ్, కొత్త చందర్గౌడ్, చీరాల నర్సింహ, బుక్యా సుమన్నాయక్, కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్, అనూరాధ, వెంకట్రెడ్డి, మల్లేశ్, నర్సింగ్రావు, కో ఆఫ్షన్ సభ్యులు శౌకత్ మియ్యా, సురేందర్ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ, పార్టీ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, ముల్లి జంగయ్యయాదవ్, మేనేజర్ శ్రీధర్రెడ్డి, డీఈ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
బోడుప్పల్ హైస్కూల్లోని ఐసొలేషన్ సెంటర్ నిర్వాహణకు స్థానిక మేయర్ తనయుడు సామల మనోహర్రెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.