శామీర్పేట, మే 17: సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం నేతృత్వంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామగా, కుటుంబ పెద్దగా ఉండి పెండ్లీలకు రూ.100116 అందజేస్తూ తల్లిదండ్రులపై భారాన్ని తగ్గిస్తున్నారన్నారు. శామీర్పేట మండలంలో 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనితాలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి జగదీశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్, మే 17 : కల్యాణ లక్ష్మి పథకం పేద కు టుంబాలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని పోచారం చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 38మంది లబ్ధ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని, కొవిడ్ కారణంగా లబ్ధ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి సోమవారం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెల ంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ పేదలకు అండగా నిలుస్తుందన్నారు. లబ్ధిదారుల తరఫున చైర్మన్ కొండల్రెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.